విశాలాంధ్ర అనంతపురం ఈనెల 21, 22 తేదీలలో జరుగు సిపిఐ జిల్లా కార్యవర్గ సమావేశం, జనరల్ బాడీ సమావేశాన్ని ఈనెల 29న వి. కె. మెమోరియల్ హాల్లో నిర్వహిస్తున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి సి జాఫర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. ఈ జనరల్ బాడీ సమావేశం ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. మధ్యాహ్నం భోజనం అనంతరం జిల్లా కార్యవర్గ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశాలకు సభ్యులు, సానుభూతిపరులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.