Tuesday, May 21, 2024
Tuesday, May 21, 2024

మానవతా శాఖా సంస్థ మజ్జిగ పంపిణీ

విశాలాంధ్ర – కొయ్యలగూడెం ( ఏలూరు జిల్లా) : కొయ్యలగూడెం మానవతా శాఖా సంస్థ సభ్యుడు ఉద్దగిరి కిరణ్ సౌజన్యంతో సోమవారం ప్రధాన సెంటర్లో ఉన్న వినాయకుని ఆలయం వద్ద వాహన చోదకులకు, పాదచారులకు, మానవత శాఖ సభ్యులు ఉచిత మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ మజ్జిగ పానీయాలను తీసుకోవాలని, వడదెబ్బ తగలకుండా తమ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముప్పనపల్లి వెంకటేశ్వరరావు, వి ఎస్ ఎన్ స్వామి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img