Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

వైకాపా అభ్యర్థుల విజయానికి కృషి చేద్దాం

మళ్లీ జగనన్ననే ముఖ్యమంత్రిని చేసుకుందాం

ఎంపీపీ అనూష దేవి

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- ప్రస్తుతం జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో వైకాపా అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల విజయానికి పార్టీ శ్రేణులంతా సమిష్టిగా కృషి చేయాలని ఎంపీపీ కోరాబు అనుషా దేవి అన్నారు. మంగళవారం స్థానిక సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు దురియా పుష్పలత, లమ్మసింగి సర్పంచ్ కొర్ర శాంతి కుమారి, ఎంపీటీసీ రావుల నాగమణిలతో కలిసి లమ్మసింగి పంచాయతీలోని భీమనాపల్లి, అసరాడ, రింగుడు మెట్ట, అడ్డాల వీధి, చీకటిమామిడి, తోటరాజు బంద, జల్లూరు మెట్ట, బురడ వీధి, నూతి బంద గ్రామాలలో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ అనూష దేవి మాట్లాడుతూ ఈ ఏడాది మే నెలలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల కోసం వైకాపా పాడేరు శాసనసభ అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఈ నెల 19న నామినేషన్ వేయనున్నారన్నారు. ఈ నామినేషన్ ప్రక్రియకు మండలంలోని పలు గ్రామాల నుండి అధిక సంఖ్యలో పార్టీ అభిమానులు, కార్యకర్తలు తరలిరావాలన్నారు. సంక్షేమ సారధి, బడుగు, బలహీనవర్గాల ఆశాజ్యోతి, వైకాపా అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవడమే ధ్యేయంగా పాడేరు అసెంబ్లీ అభ్యర్థి మత్స్యరాస విశ్వేశ్వర రాజు, అరకు పార్లమెంట్ అభ్యర్థి గుమ్మ తనూజ రాణిలను అత్యధిక మెజారిటీతో గెలిపించి జగనన్నకు బహుమతిగా ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో తాజంగి సర్పంచ్ వంతల మహేశ్వరి, ట్రైకార్ డైరెక్టర్ సుర్ల లోవరాజు, డేవిడ్ రాజు, రవి, వార్డ్ మెంబర్ జానకి, రఘునాథ్, నూకరాజు, చంటి, రమణ, రాజు, సుందర్రావు, రామారావు, అంగద రావు, పోతురాజు, బాబురావు, రవి, సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img