Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

పూరి గుడిసె అగ్ని ప్రమాదం……

విశాలాంధ్ర పామిడి (అనంతపురం) : అనంతపురం జిల్లా పామిడి మండలం రామగిరి ఎగువ తండా గ్రామంలో ఆర్ లక్ష్మక్క భర్త ఠాక్రే నాయక్ అను వారి పూరి గుడిసె అగ్ని ప్రమాదం సంభవించడంతో అందులో ఉన్న ఒక ఎద్దు తో పాటు మూగజీవాలు వ్యవసాయ పరికరాలు పూర్తిగా గద్దంమైనద దాదాపుగా మూడు లక్షల 30 వేల రూపాయలు నష్టం జరిగినది. విషయం తెలుసుకున్న మానవ దృఢ సంకల్పంతో తన వంతు సహాయం చేయాలని గుణంతో రామగిరి దిగువ తాండ గ్రామానికి చెందిన డిప్యూటీ కలెక్టర్ ఆర్ కృష్ణా నాయక్ తమ్ముడు ఆర్ రమేష్ నాయక్ అనువారు 5000 రూపాయలు ఆ కుటుంబానికి సహాయం అందించడం జరిగినది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు గుత్తి ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ వడ్డే ఆనంద్ బాబు గుంతకల్ నియోజకవర్గం తెలుగు యూత్ ప్రధాన కార్యదర్శి సుదర్శన్ బాబులి రామగిరి వైస్ ప్రెసిడెంట్ వై వెంకటప్ప నాయుడు సీనియర్ నాయకులు వడ్డే రంగన్న, మల్లికార్జున రమేష్ దేవల నాయక్ రాజు నాయక్ గౌడ్ నాయక్ లక్ష్మణ్ నాయక్ కేశవ మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img