శ్రీ సత్య సాయి జిల్లా ఆర్య వైశ్య యువజన సంఘం అధ్యక్షులు కలవల నాగ తేజ
విశాలాంధ్ర – ధర్మవరం : శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురంలోని శ్రీ వాసవి ధర్మశాల లో జిల్లా ఆర్యవైశ్య సంఘం హాస్టర్ ఆర్ వి హాస్పిటల్ బెంగళూరు వారి ఆధ్వర్యంలో ఈనెల 30వ తేదీ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఉచిత మెగా హెల్త్ క్యాంపును నిర్వహిస్తున్నట్లు శ్రీ సత్య సాయి జిల్లా ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు కలవల నాగతేజ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఉన్న ఆర్య వైశ్యులు ఇటువంటి క్యాంపు ను సద్వినియోగం చేసుకొని ఆరోగ్యమును పదిలంగా ఉంచుకోవాలని తెలిపారు. నిష్ణాతులైన, అనుభవజ్ఞులైన వైద్యులచే అన్ని జబ్బులకు సరియైన వైద్య చికిత్సలను అందించడంతోపాటు ఆరోగ్య సూత్రాలను కూడా వివరించడం జరుగుతుందన్నారు. జిల్లా ఆర్యవైశ్య సంఘం హిందూపురం ఆర్యవైశ్య సంఘం సహకారంతోనే ఈ హెల్త్ క్యాంపు ను నిర్వహించడం సంతోష దాయకమని తెలిపారు. కావున జిల్లాలోని ఆర్యవైశ్య కుల బాంధవులు ఇటువంటి క్యాంపులో సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.