Tuesday, May 21, 2024
Tuesday, May 21, 2024

పార్వతీపురం అసెంబ్లీనియోజకవర్గానికి పోటీలోఉన్న ఎంఎల్ఏ అభ్యర్దులు వీరే: ఆర్ఓ హేమలత

విశాలాంధ్ర,పార్వతీపురం: పార్వతీపురం అసెంబ్లీ స్థానానికి పోటీలోఉన్న అభ్యర్థులు 8మంది మాత్రమేనని ఎన్నికల రిటర్నింగ్ అధికారైన పార్వతీపురం ఆర్డీఓ కె. హేమలత ఒకప్రకటనలో తెలిపారు.
అలజింగి జోగారావు (వైఎస్ఆర్సీపీ- సీలింగు ఫ్యాన్), కుప్పిలి వెంకటరమణ
(బిఎస్ పి-ఏనుగు), బత్తిన మోహనరావు ఇండియా నేషనల్ కాంగ్రెస్ – హస్తం), బోనెల విజయ్ చంద్ర(టీడిపి – సైకిల్), గుంట జ్యోతి (జైభీంరాంభారత్ పార్టీ – కోటు), పొట్నూరు కిరణ్ కుమార్ (జై భారత్ నేషనల్ పార్టీ – బ్యాటరీ టార్చ్), ఉదయభాను గర్భాపు(స్వతంత్ర అభ్యర్థి – రింగు) గర్భాపు మోహనరావు(స్వతంత్ర అభ్యర్థి – చెప్పల్స్) పోటీలో ఉన్నారని ఆమె తెలిపారు.బ్యాలెట్ పత్రంలో ఇదే వరుసులో ఉండే వీరందరికీ గుర్తులు కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాలు మేరకే కేటాయించామని చెప్పారు. ఇదిలా ఉండగా పార్వతీపురం మన్యం జిల్లాలోని కురుపాం నియోజకవర్గంలో ఏడుగురు, పాలకొండ నియోజకవర్గంలో ఏడుగురు, సాలూరు నియోజకవర్గంలో ఏడుగురు అభ్యర్థులు పోటీలోఉన్నట్లు ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు తెలిపారు. అరకు పార్లమెంటు పరిధిలో 13 మంది ఎంపీ అభ్యర్థులు పోటీలో ఉన్నారని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img