రాజాం (విజయనగరం జిల్లా) : ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీశ్రీశ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి మారు జాతర మంగళవారం నేటి ఉదయం తెల్లవారుజామున 5:00 నుండి అమ్మవారిని దర్శించుకొనుటకై భక్తులు వందల మంది గుడి ముందు నిలుచుని అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు. తెల్లవారుజాము నుండి ఆలయ ప్రధాన అర్చకులు వేమకోటి సూర్యనారాయణ శర్మ భక్తులకు పూజలు అందించి తీర్థ ప్రసాదములు అందజేశారు. ఆలయ అనువంశక ధర్మకర్త వాకచర్ల దుర్గాప్రసాద్, ఈవో బీ.వీ. మాధవరావు, భక్తులకు అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేశారు…