విశాలాంధ్ర- సీతానగరం: పార్వతీపురం నియోజకవర్గం పరిధిలో ఎక్కడైనా సమస్యలు తలెత్తిన వెంటనే స్థానిక ఎమ్మెల్యే అలజంగి జోగారావు తనదైన శైలిలో పరిష్కారానికి కృషిచేస్తున్నారు.పెదభోగిలి మేజర్ పంచాయతీలోని అప్పయ్యపేట గ్రామంలో ప్రజలు కొద్దిరోజులనుండి త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొని రాగా వెను వెంటనే పార్వతీపురం నుంచి మంచినీటి ట్యాంకులు ద్వారా నీరు పంపించి ప్రజలకు నీరు అందించడం జరిగిందన్నారు. అప్పుడెప్పుడో వేసిన నీటి సరఫరా పైపులు రైల్వే 3వ లైన్ పనులలో బాగంగా వాటిని తొలగిస్తే వెంటనే సమస్యను గుర్తించిన ఎమ్మెల్యే రూ. 8 లక్షల రూపాయలు నిధులను మంజూరు చేసి కొత్త పైపులు వేయించి గ్రామానికి యుద్ద ప్రాతిపదికన మంచినీరు అందించడం జరిగింది. మంగళవారం ఎమ్మెల్యే చేతుల మీదుగా కుళాయి పైపులు ద్వారా త్రాగు నీరు విడుదల చేసి ప్రజలకు అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామ ప్రజల దాహార్తిని తీర్చేందుకు మంచినీటి సమస్యను అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకుని నిధులు మంజూరు చేయించి సకాలంలో పనులు పూర్తి చేయించి నీరు అందివ్వడం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు.ఇంతవరకు గ్రామంలో 1400 మీటర్లు మురుగునీటి కాలువలు నిర్మాణం పూర్తి చేయడం జరిగినదని, అలానే గ్రామంలో ప్రధాన రహదారి కాలువలు నిర్మాణం కూడా త్వరలో చేపట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే జోగారావు తెలిపారు. ఇచ్చారు. ఇదే కాకుండా కాలువలు, రోడ్డు నిర్మాణం పూర్తి చేసిన వెంటనే ఇంటి ఇంటికి కుళాయిలు ద్వారా ప్రతీ ఇంటికి మంచినీరు అందించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యమంత్రి సీఎం వైయస్ జగన్ ను మళ్లీ సీఎంగా ఆశీర్వదించి దీవించాలని ఎమ్మెల్యే ప్రజలకు పిలుపు ఇచ్చారు. త్రాగునీటి సదుపాయం, అభివృధ్ధి పనులు పెద్ద ఎత్తున చేపట్టిన ఎమ్మెల్యే జోగారావుకు ఎంపీటీసీ బురిడీ కుసుమకుమారి సూర్యనారాయణ, వైసీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అప్పయ్యపేట గ్రామప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.