Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

రానున్న ఎన్నికల్లో మనమంతా అప్రమత్తంగా ఉండాలి

విజయనగరం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు
విశాలాంధ్ర – విజయనగరం అర్బన్ : రానున్న ఎన్నికల్లో మనమంతా అప్రమత్తంగా ఉండాలని విజయనగరం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. మంగళవారం అశోక్ గారి బంగ్లాలో విజయనగరం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశమునకు ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయనగరం శాసనసభ తెలుగుదేశం-జనసేన-బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతి రాజు
మాట్లాడుతూ ఈ ఎన్నికలలో మనమందరం అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ఓటర్ల జాబితాను అందరు క్షుణ్ణంగా పరిశీలించాలని, దొంగ ఓట్లను గుర్తించడం, అదేవిధంగా కొత్త ఓటర్ల చేర్పులు కోసం ప్రత్యేక శ్రద్ద వహించాలని సూచించారు. కుటుంబ సాధికార సారధులను త్వరగా పూర్తి చేయాలని కోరారు. ఈ అంశాలను ప్రతిరోజూ సమన్వయము చేయడానికి కొంతమంది సీనియర్ నాయకులకు బాధ్యతలు ఇవ్వడం జరిగిందన్నారు, అందరూ కలిసి ఉత్సాహంగా పనిచేయాలని కోరారు . అదే విధంగా న్యాయవాదులు కూడా అందరికి అందుబాటులో ఉంటారని తెలియజేసారు.
ఈ సమావేశంలో నియోజకవర్గం లో గల రాష్ట్ర, పార్లమెంట్, నియోజకవర్గ, పట్టణ/మండల స్థాయి కమిటీల నాయకులు, వార్డు/గ్రామ పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, కార్పొరేటర్ అభ్యర్థులు, ఎంపిటిసి, సర్పంచ్ అభ్యర్థులు, క్లస్టర్, యూనిట్ ఇంచార్జ్ లు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img