జిల్లా ఆడిట్ అధికారి శ్రీనివాస్
విశాలాంధ్ర – గణపవరం : సహకార రంగంలో రైతులకు సేవలు అందించాలని సహకార సంఘాల జిల్లా ఆడిట్ అధికారి ఏ శ్రీనివాస్ అన్నారు.శుక్రవారం 69 వ సహకార వారోత్సవాలు సందర్భంగా 5వ రోజున గణపవరం మండలం మొయ్యేరు ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం నిర్వహించిన సహకార వారోత్సవాలను సహకార సంఘం ఛైర్ పర్సన్ ఈదర అశోక్ చక్రవర్తి సప్త వర్ణ పతాకం ఆవిష్కరించరు. ఈ కార్యక్రమంలో సహకార వారోత్సవాలు ఇంచార్జీ ఆర్ శ్రీనివాస్ ఆడిట్ కార్యాలయ పర్యవేక్షకులు, సంఘం పర్సన్ గంటా పద్మజి, సత్తి అప్పరెడ్డి, రైతులు స్కూల్ పిల్లలు, పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆడిట్ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ సహకార రంగంలో వచ్చిన మార్పులు వ్యాపార అవకాశములు ఉపయోగించి కొని సభ్యులకు ప్రజలకు కావాల్సిన సేవలను అందించి సమిష్టి గా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సీఈవో ఎండి శ్రీనివాస్ , సంఘం సిబ్బంది పాల్గొన్నారు.