విశాలాంధ్ర – గణపవరం: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతులకు దళారీల వ్యవస్థకు తావు లేకుండా నేరుగా రైతు భరోసా కేంద్రాల ద్వారా అమ్ముకునే అవకాశాన్ని ముఖ్యమంత్రి జగన్ రైతులకు మంచి అవకాశం కల్పించాలని గణపవరం మండలం జల్లి కాకినాడ గ్రామ సర్పంచ్ బాతు నాగేశ్వరరావు (నాగరాజు) అన్నారు. జల్లి కాకినాడ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్, వ్యవసాయ అధికారి, గ్రామ రెవెన్యూ అధికారి వర్మ సమక్షంలో గ్రామానికి చెందిన రైతు మల్లుల శ్రీనివాస్ దగ్గర వరి ధాన్యం కొనుగోలను ప్రారంభించారు.