నూజివీడు సబ్ కలెక్టర్ అర్షద్ రాజేంద్రన్
విశాలాంధ్ర చాట్రాయి: ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని నూజివీడు సబ్ కలెక్టర్ అర్షత్ రాజేంద్రన్ తెలిపారు. గురువారం సాయంత్రం మండలంలోని చనుబండ గ్రామంలో 1,2 సచివాలయాల పరిధిలో నిర్మాణంలో వున్న రైతు భరోసా కేంద్రాలను ఆయన పరిశీలించారు. వర్క్ ఇస్ వెరీ గుడ్ అంటూ అభినందించారు.తహశీల్దార్ విశ్వనాథరావు ఎంపిడిఓ మురళీమోహన్ వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈకార్యక్రమంలో చనుబండ సర్పంచ్ విస్సంపల్లి జ్యోతి వైసీపీ మండల నాయకులువనమా వాసు తదితరులు పాల్గొన్నారు.
స్పందనలో ఫిర్యాదులు పరిష్కరించండీ..
చాట్రాయి తాసిల్దార్ కార్యాలయంలో రికార్డులు పరిశీలించిన సబ్ కలెక్టర్ స్పందనలో ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. తాసిల్దార్ విశ్వనాధరావు,ఎంపిడిఓ మురళీమోహన్ ఎఒ శివశంకర్ లను ప్రభుత్వ పథకాల అమలు గురించి అడిగి తెలుసుకున్నారు.