Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా…? లేదా…?

ఎంఎల్ఎ ప్రతాప్

విశాలాంధ్ర – చాట్రాయి : అమ్మా….ప్రభుత్వ పథకాలన్నీ మీకు వస్తున్నాయా లేదా…? మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా…? అంటూ నూజివీడు శాసన సభ్యులు ప్రతాప్ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. గురువారం బూరుగగూడెం గ్రామంలో ఆయన గడపగడపకు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దళితులతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలను గురించి తెలియజేశారు. పేదలు మాట్లాడుతూ ఇళ్ల స్థలాలు వచ్చాయన్నారు. ఇంటి నిర్మాణం చేపట్టలేదని, ఎప్పుడు ఇంటి నిర్మాణం పూర్తి చేసి ఇస్తారు అని ప్రశ్నించారు.
పనులు వరుసక్రమంలో ప్రభుత్వం చేస్తూ వస్తుందని సమాధానం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏపి కోఆపరేటివ్ యూనియన్ చైర్మన్ రాఘవరెడ్డి, ఎంపీపీ లంకా నిర్మల, వైసీపీ మండల అధ్యక్షులు మిద్దె బాలకృష్ణ , సీనియర్ నాయకులు చెలికాని బాబ్జి, బూరుగగూడెం సర్పంచ్ దేశిరెడ్డి హైమావతి, చిత్తపూరు సర్పంచ్ తిరివీధి రమేష్, చిన్నంపేట పిఎసిఎస్ చైర్ఫర్సన్ పి.చెన్నారావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img