Saturday, May 11, 2024
Saturday, May 11, 2024

నిరంతర అభివృద్ధే మా ధ్యేయం

సర్పంచ్ విస్సంపల్లి ప్రశాంతి

విశాలాంధ్ర – చాట్రాయి:నిరంతరం గ్రామ సమగ్రాభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నామని నరసింహారావు పాలెం గ్రామపంచాయతీ సర్పంచ్ విస్సంపల్లి ప్రశాంతి అన్నారు. గురువారం మధ్యాహ్నం చాట్రాయి మండలం నరసింహారావు పాలెం పంచాయితీలో యాదవ్ బజార్ లోని జలజీవన్ పనులను సాంప్రదాయ బద్ధంగా పూజలు నిర్వహించి ప్రారంభించారు.ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల పరిషత్ ఉపాధ్యక్షులు పుచ్చకాయల సుబ్బారెడ్డి నాయకత్వంలో నిరంతరం నరసింహ రావుపాలెం పంచాయతీ లో అన్ని రంగాలలో సమగ్రమైన అభివృద్ధి సాధించడానికి అనునిత్యం పయనిస్తున్నామని తెలిపారు. మండల పరిషత్ ఉపాధ్యక్షులు పుచ్చకాయల సుబ్బారెడ్డి మాట్లాడుతూ దశాబ్దాల కాలం నుంచి ఎన్నికష్టనష్టాలు ఎదురైన మొక్క ఒని పోరాట దీక్షతో ప్రజాజీవితంలో వుంటున్నామని గుర్తుచేసారు.ప్రజలు మాపై వుంచిన నమ్మకానికి విశ్వాసాని మేము కూడా నిలబెట్టుకుంటామన్నారు
రాజీలేని విధంగా నిరంతరం అబివృద్దే ద్యేయం గా పయనిస్తున్నా మన్నారు.కార్యక్రమంలో సచివాలయం కన్వీనర్ విస్సంపల్లి సీతయ్య పిఎసిఎస్ చైర్మన్ వెంకటరెడ్డి వైసిపి గ్రామకమిటీ అధ్యక్షులు గొర్లవేంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img