Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

టిడిపి మండల అధ్యక్షుడు నాగార్జున గుండెపోటుతో మృతి

కొయ్యలగూడెం: టిడిపి కొయ్యలగూడెం మండల అధ్యక్షుడు వాడపల్లి నాగార్జున శుక్రవారం ఉదయం మంగపతి దేవి పాలెం గ్రామంలో ఆయన నివాసం వద్ద గుండెపోటుతో మృతి చెందారు. నాగార్జున కొంతకాలంగా కాలికి గాయం కావడంతో ఇంటి వద్దనే ఉండి చికిత్స పొందుతూ మండలంలో పార్టీ తరుపున జరిగే పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. నాగార్జున మరణవార్త వినగానే టిడిపి జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, పోలవరం మాజీ శాసనసభ్యులు మొడియం శ్రీనివాసరావు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ ఇమ్మణ్ణి రాజేశ్వరి, గోపాలపురం మాజీ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, పోలవరం నియోజకవర్గ కన్వీనర్ బోరగం శ్రీనివాసరావు, చింతలపూడి మాజీ ఎమ్మెల్యే గంటా మురళి, పోలవరం నియోజకవర్గం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పారేపల్లి రామారావు, పార్టీ ఆర్గనైజింగ్ కమిటీ సభ్యురాలు గంగిరెడ్ల మేఘాల దేవి, జిల్లాలో ఉన్న టిడిపి నాయకులు, మండల నాయకులు ఆయన భౌతిక ఖాయానికి పార్టీ జెండా కప్పి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ నాగార్జున పార్టీలో కార్యకర్త స్థాయి నుండి ఎనలేని సేవ చేస్తూ పార్టీలో మంచి గుర్తింపు తెచ్చుకుని టిడిపి మండల అధ్యక్షుడిగా కొనసాగుతూన్న తీరు ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. నాగార్జున మృతి చెందడం తెలుగుదేశం పార్టీకి తీరని లోటని పోలవరం మాజీ శాసనసభ్యులు మొడియం శ్రీనివాసరావు పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img