Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ప్రజా సమస్యలు పరిష్కారమే ధ్యేయం

వైసిపి నాయకులు దామెర ప్రసాద్ బాబు

విశాలాంధ్ర చాట్రాయి : బలహీన వర్గాల నివాస ప్రాంతంలో మెరుగైన తాగునీరు అందించడం కోసం పైప్ లైన్ పనులు ప్రారంభించినట్లు వైసిపి మండల సీనియర్ నాయకులు దామెర ప్రసాద్ బాబు తెలిపారు.మండల కేంద్రమయిన చాట్రాయి పంచాయతీ గొల్లగూడెంలో తాగునీటి సౌకర్యం మెరుగు పరచడంకోసం రూ.10 లక్షల అంచనాలతో మంజూరైన పనులను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతినిత్యం ప్రజాసమస్యలు పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు.దళిత బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికోసం 75ఏళ్ళ స్వాతంత్య్ర భారతధేశంలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పదకాలు అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి జగన్ కే దక్కిందన్నారు.ప్రతీనెలా 1వతేది ఉదయం 5గంటలనుంచి నిరుపేదల కు పించన్లు పంపిణీ చేసిఆదుకుంటున్నారన్నారు. ప్రభుత్వానికి మద్దతు పలకాలని కోరారు. ఈ కార్యక్రమంలో సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ దుర్గాప్రసాద్, వైసిపి నాయకులు సంకు సత్యనారాయణ, నెల్లూరు సత్యనారాయణ, వార్డు సభ్యులు నరసింహ రావు, చెన్నారావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img