Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పంచాయతీ స్థలంలో అక్రమ కట్టడాలు

విశాలాంధ్ర – పాలకొల్లు : మండలంలోని పాలమూరు గ్రామంలో హైకోర్టు ఇచ్చిన స్టేనే ధిక్కరించి, పంచాయతీ స్థలంలో వైసీపీ నాయకుల అండతో అక్రమ కట్టడం పనులు నిర్వహిస్తున్నారని పాలమూరు గ్రామ సర్పంచ్ పి వి ఎస్.వి.ఎస్ స్వామి నాయుడు ఆరోపించారు. పాలకొల్లు రూరల్ మండలం పాలమూరు గ్రామంలో పంచాయతీకి సంబంధించిన స్థలంలో పంచాయతీ తీర్మానం లేకుండా అధికార వైసిపి నాయకులు అండదండలతో అక్రమ నిర్మాణాన్ని చేపట్టిన విషయంపై సర్పంచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయితీ అనుమతి లేకపోవడంతో సర్పంచ్ పి వి ఎస్వీఎస్ స్వామి నాయుడు స్పందన కార్యక్రమంలోనూ కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అనంతరం హైకోర్టును ఆశ్రయించి పంచాయతీ స్థానంలో పంచాయతీ అనుమతి లేకుండా అక్రమ కట్టడం నిర్మిస్తున్నారని, హైకోర్టును ఆశ్రయించి స్టే తీసుకువచ్చినా, హైకోర్టు ఆర్డర్ ను లెక్కచేయకుండా స్థానిక వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో పనులను తిరిగి మళ్లీ సోమవారం మొదలుపెట్టారని సర్పంచ్ స్వామి నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ సర్పంచ్ కు కనీస విలువ ఇవ్వకుండా, ఇస్తానుసారం ప్రవర్తించడం ఎంతవరకు సబబు అని సర్పంచ్ ప్రశ్నించారు. వెంటనే సంబంధిత అధికారులు ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img