విశాలాంధ్ర – కొయ్యలగూడెం : పశ్చిమ డెల్టా బోర్ చైర్మన్ గంజిమల దేవి పుట్టినరోజు వేడుకలను కొయ్యలగూడెం లో మంగళవారం ఆమె నివాసం వద్ద ఆమె భర్త ఎంపీపీ గంజిమల రామారావు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు పోలవరం నియోజకవర్గ శాసనసభ్యులు తెల్లం బాలరాజు హాజరయ్యారు. బాలరాజు సమక్షంలో కేక్ కటింగ్ నిర్వహించారు. అనంతరం పట్టణానికి చెందిన ఊసల తెజేష్ అనే యువకుడికి గత 4నెలల క్రితం గుర్తుతెలియని కారు ఢీకొనడంతో తేజష్ కాలికి బలమైన గాయం కావడంతో అతని చికిత్స నిమిత్తం దేవి రూ.10వేలను శాసనసభ్యులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, తన పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం నిరుపేదలైన ఒకరికి ఆరోగ్య విషయంలో నగదును వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వైద్య ఖర్చుల నిమిత్తం అందజేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ దాసరి శ్రీలక్ష్మి, మాజీ ఎంపీపి మట్టా సత్తిపండు,వైస్ ఎంపీపీ తుమ్మల పల్లి గంగరాజు,దిప్పకాయల పాడు గ్రామ పంచాయితీ సర్పంచ్ సున్నం శాంతకుమారి,ఎంపీటీసీ గంట శ్రీనివాస్, వైసిపి మండల కన్వీనర్ గొడ్డటి నాగేశ్వరావు,మారిశెట్టి శ్రీను, జిల్లా ప్రధాన కార్య దర్శి దాసరి విష్ణు, మండల వార్డ్ సభ్యుల అధ్యక్షులు పూలపల్లి రవికుమార్, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.