Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఇన్ని అబద్ధాలను టెలిప్రాంప్టర్‌ సైతం భరించలేకపోయింది

ప్రధాని మోదీపై రాహుల్‌ విసుర్లు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ మరోసారి ట్విటర్‌ వేదికగా చురకలు వేశారు. దావోస్‌ వేదికగా జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో మోదీ ప్రసంగిస్తుండగా టెలిప్రాంప్టర్‌ సక్రమంగా పని చేయని నేపథ్యంలో రాహుల్‌ గాంధీ ఓ ట్వీట్‌ చేశారు. ఇన్ని అబద్ధాలను టెలిప్రాంప్టర్‌ సైతం భరించలేకపోయిందని ఎద్దేవా చేశారు. వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం దావోస్‌ ఎజెండా సదస్సును ఐదు రోజులపాటు నిర్వహిస్తోంది. సోమవారం నుంచి ఈ సదస్సు జరుగుతోంది.తొలిరోజు సమావేశంలో ప్రధాని మోదీ దిల్లీ నుంచి వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు. అయితే ప్రసంగం మధ్యలో టెలిప్రాంప్టర్‌ సరిగా పని చేయలేదు. దీంతో ఆయన అర్థాంతరంగా తన ప్రసంగాన్ని నిలిపేయవలసి వచ్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img