హుజూరాబాద్లో ప్రలోభాల పర్వం కొనసాగుతోందని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్లో ఈటల రాజేందర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ..హుజురాబాద్లో నియోజకవర్గంలో ఊర్లను బార్లుగా మార్చి, మద్యం ఏరులు పారిస్తున్నారన్నారు. తన మొహం కనిపించకుండా చేసేందుకు ఇప్పటికే ఐదువందల కోట్ల నల్లధనం ఖర్చు చేశారన్నారు. ఈ పరిణామాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని అన్నారు.