Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతాయి

: మంత్రి గంగుల

రాష్ట వ్యాప్తంగా 1033 కొనుగోలు కేంద్రాలు ప్రారంభమయ్యాయని మంత్రి మంత్రి గంగుల కమలాకర్‌ తెలిపారు.పంట కోతలు పూర్తయిన ప్రాంతాల్లోనూ అవసరమైన చోట తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలను ఇచ్చామని మంత్రి తెలిపారు.రాష్ట్ర వ్యాప్తంగా 2021-22 వానకాలం ధాన్యం కొనుగోలు ఏర్పాట్లు అంశంపై సోమవారం రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. సివిల్‌ సప్లైస్‌ కమిషనర్‌ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో సివిల్‌ సప్లైస్‌ శాఖా పరంగా చేసిన ఏర్పాట్లను మంత్రికి అధికారులు వివరించారు. ఈ సందర్భంగా ధాన్యంకు సరిపడా గన్నీలు అందుబాటులో ఉన్నాయని, రైతులకు ఎలాంటి ఆందోళన అవసరం లేదన్నారు. తప్పుడు ప్రచారాన్ని పట్టించుకోవద్దన్నారు.కొనుగోలు పూర్తయిన తర్వాత తరలించడానికి ట్రాన్స్‌ పోర్టు సదుపాయాలు కూడా పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img