యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ . కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటాడన్న సంగతి తెలిసిందే.అభిమానులకు ఆర్థికంగా సాయం చేయడమే కాకుండా.. ఆపదలో ఉన్నవారికి సాయం చేస్తుంటాడు. తాజాగా ఆంధ్రప్రదేశ్ వరద బాధితులకు అండగా ఉండేందుకు ముందుకు వచ్చాడు. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో వరదలు ముంచేత్తిన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగు జిల్లాలు వరదల దాటికి తీవ్రంగా నష్టపోయాయి. కాలువలు, నదులు పొంగిపోయాయి. చెట్లు, ఇళ్లూ కూలీపోయి ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లింది. వరదల దాటికి నష్టపోయిన వారిని ఆదుకునేందుకు ప్రభాస్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కు రూ. కోటి విరాళం ప్రకటించాడు. ఇందుకు సంబంధించిన చెక్కును త్వరలోనే సీఎం కార్యాలయానికి పంపనున్నారు.గతంలో కరోనా సమయంలోనూ ఈ పాన్ ఇండియా స్టార్ రెండు తెలుగు రాష్ట్రాలకు చెరో రూ. 50 లక్షల చొప్పున విరాళం అందించాడు. ప్రధానమంత్రి సహాయనిధికి మరో రూ. 3 కోట్లు ఇచ్చాడు.