మహారాష్ట్రలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కలకలం రేపుతోంది. నిన్న ఒక్కరోజు ఆ రాష్ట్రంలో ఏడు కేసులు వెలుగుచూశాయి. ఇందులో మూడున్నరేళ్ల చిన్నారి కూడా ఉంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా దేశ వాణిజ్య రాజధాని ముంబైలో శనివారం నుంచి రెండు రోజులపాటు 144 సెక్షన్ ను అమలు చేస్తున్నట్లు ముంబై డిప్యూటీ పోలీసు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. 144 సెక్షన్ అమలు సందర్భంగా ముంబై నగరంలో శని, ఆదివారాల్లో ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు, ఎక్కువ మంది జనం గుమిగూడే సమావేశాలను నిషేధిస్తున్నట్లు ముంబై డిప్యూటీ పోలీసు కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. శుక్రవారం 7 ఒమైక్రాన్ వేరియెంట్ కేసులు నమోదైనాయి.ముంబైలో 3 కేసులు, పింప్రీ చించ్ వద్ మున్సిపల్ కార్పొరేషన్ లో 4 కేసులు వెలుగుచూశాయి. ఒమైక్రాన్ కరోనా వైరస్ సోకిన ముగ్గురు రోగులు టాంజానియా, యూకే, దక్షిణాఫ్రికా దేశాల నుంచి వచ్చారని ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు.నిన్నటివరకు దేశంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 32కు చేరగా, అందులో మహారాష్ట్రలోనే 17 కేసులున్నాయి. రాజస్థాన్ రాష్ట్రంలో 9, గుజరాత్, కర్ణాటక, ఢల్లీిలలో ఒమైక్రాన్ కేసులు వెలుగుచూశాయి.