Friday, May 3, 2024
Friday, May 3, 2024

పులివెందులలో జగనన్న కాలనీ : సీఎం జగన్‌

పులివెందులలో 323 ఎకరాల్లో జగనన్న కాలనీ నిర్మిస్తున్నట్లు సీఎం జగన్‌ వెల్లడిరచారు.మూడు రోజుల కడప జిల్లా పర్యటనలో భాగంగా సీఎం జగన్‌ శుక్రవారం పులివెందుల నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, పులివెందులలో 323 ఎకరాల్లో జగనన్న కాలనీ నిర్మిస్తున్నామని, ఒక్కో ఇంటి పట్టా విలువ కనీసం రూ. 2 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు.రూ. 147 కోట్లతో జగనన్న కాలనీ అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. జగనన్న కాలనీలో 8042 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వం ఒక్కో ఇంటిపై రూ. 6 లక్షలు ఖర్చు పెడుతోందని తెలిపారు. కోర్టు కేసుల కారణంగా కార్యక్రమం ఆలస్యమయిందని, జగనన్న కాలనీలో అన్ని రకాల మౌలిక సదుపాయల అభివృద్ధి చేపట్టినట్లు తెలిపారు. జగనన్న కాలనీకి సమీపంలోనే ఇండస్ట్రీయల్‌ కారిడార్‌ ఏర్పాటు చేయనున్నట్లు, నివాస ప్రాంతాలకు సమీపంలోనే ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. పులివెందులలో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజ్‌కు రూ. 100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అలాగే రూ. 65 కోట్లతో సమగ్రనీటి పథకం, నియోజకవర్గంలో ప్రతి ఇంటికి మంచినీటి సరఫరా అందించనున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img