క్రయోజనిక్ ఇంజిన్ పరీక్ష విజయవంతం
చెన్నై: చంద్రుడిపై పరిశోధనలో భాగంగా భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గగన్యాన్ ప్రాజెక్టులో ముందడుగు పడిరది. ఇందుకోసం ఉపయోగించే క్రయోజనిక్ఇంజిన్ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు బుధవారం విజయవంతంగా పరీక్షించారు. తమిళనాడు, మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్సన్ కాంప్లెక్స్లో పది నిమిషాలకు పైగా పరీక్షించినట్లు ఇస్రో వెల్లడిరచింది. ఇందులో ఇంజిన్ పనితీరు లక్ష్యాలను చేరుకుందని, ముందుగా నిర్ణయించుకున్న అంచనాలను అందుకున్నట్లు పేర్కొంది. ‘ఈ దీర్ఘకాల పరీక్ష విజయవంతం కావటం గగన్యాన్ ప్రాజెక్టులో కీలక మైలురాయి. ఈ పరీక్ష గగన్యాన్ లాంచ్వెహికిల్లో ఉపయోగించే క్రయోజనిక్ ఇంజిన్ విశ్వసనీయతను, పటిష్ఠతను నిర్ధరిస్తుంది’ అని ఇస్రో వెల్లడిరచింది. ఈ ఇంజిన్ సుమారు 1810 సెకన్ల పాటు జరిగే మరో నాలుగు పరీక్షలను ఎదుర్కోనుందని తెలిపింది. దీంతో పాటు మరో ఇంజిన్ రెండు స్వల్ప కాలిక పరీక్షలను, ఒక దీర్ఘకాలిక పరీక్షను ఎదుర్కొంటుందని, ఈ పరీక్షలతో గగన్యాన్ కార్యక్రమంలోని ఇంజిన్ల పనితీరు, సామర్థ్యాన్ని తెలుసుకునే ప్రక్రియ పూర్తవుతుందని స్పష్టం చేసింది. గగన్యాన్ ప్రాజెక్టు డిజైన్ ప్రక్రియ పూర్తయిందని, పరీక్షల దశలోకి ప్రవేశించామని కొద్ది రోజుల క్రితం ఇస్రో ఛైర్మన్ కే శివన్ ప్రకటించిన సంగతి విదితమే. 2022, ఆగస్టు 15లోపే మానవ రహిత గగన్యాన్ ప్రయోగం చేపడతామని శివన్ తెలిపారు.