Wednesday, May 8, 2024
Wednesday, May 8, 2024

సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రారంభమైన కేబినెట్‌ భేటీ

తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌ సమావేశం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో భేటీ జరుగుతోంది. మంత్రులతో పాటు పలుశాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. కేబినెట్‌లో తాజా రాజకీయ పరిణామాలతో పాటు పలు అంశాలపై సీఎం కేసీఆర్‌ చర్చించనున్నారు. ప్రధానంగా ధాన్యం కొనుగోళ్లే ప్రధాన అజెండా మంత్రివర్గ సమావేశం జరుగనున్నది. ధాన్యం సేకరణపై కేంద్రానికి సీఎం కేసీఆర్‌ విధించిన డెడ్‌లైన్‌ ముగుస్తుండంతో ఈ అంశంపై కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img