బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటిని రైతులు ముట్టడిరచారు. . ఆయన ఇంటి ముందు వడ్లు పారబోసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పండిరచిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన రైతులు.. ఎంపీ అరవింద్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బీజేపీ నేతలు చెబితేనే వరి వేశాము కాబట్టి ఎప్పటిలాగానే కొనుగోలు కేంద్రాల ద్వారా కేంద్ర ప్రభుత్వం యాసంగి పంటను కొనిపించే బాధ్యతను ఎంపీ అరవింద్, బీజేపీ నాయకులు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో బీజేపీ నాయకులు రైతుల నుంచి భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రైతులు హెచ్చరిస్తున్నారు.