కోవిడ్ మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన నివేదికపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. ఇండియాలో కోవిడ్ వల్ల 47 లక్షల మంది మరణించినట్లు డబ్ల్యూహెచ్వో చెప్పిన విషయం తెలిసిందే. అయితే ఆ రిపోర్ట్ను ప్రభుత్వ వర్గాలు ఖండిస్తున్నాయి. దీనిపై ఇవాళ రాహుల్ తన ట్విట్టర్లో రియాక్ట్ అయ్యారు. కోవిడ్ మరణాల విషయంలో గణాంకాలు అ అబద్దం చెప్పవని, ప్రజలను మభ్య పెట్టడానికి మోదీనే తప్పుడు లెక్కలు చెబుతారని విమర్శించారు. ప్రభుత్వం పేర్కొన్నట్లు 4.8 లక్షల మంది కాదు అని, కోవిడ్ వల్ల ఇండియాలో 47 లక్షల మంది చనిపోయినట్లు రాహుల్ తెలిపారు. ఈ అంశంలో సైన్స్ అబద్ధం చెప్పదని, కానీ మోదీ సర్కార్ అవాస్తవాలు చెబుతున్నట్లు ఆయన ఆరోపించారు.. కుటుంబసభ్యుల్ని కోల్పోయిన వారిని గౌరవించాలని, ఆ ఫ్యామిలీలకు నష్టపరిహారం కింద 4 లక్షలు ఇవ్వాలని తన ట్విట్టర్ రాహుల్ కోరారు.