ఈ నెల 3 నుండి 15 వ తేదీ వరకు నిర్వహించనున్న పట్టణ ప్రగతి కార్యక్రమం పై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హోంమంత్రి మహమూద్ అలీ తో కలిసి బుధవారం సమీక్ష నిర్వహించారు.అనంతరం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలు ఎదుర్కొంటున్న అనేక దీర్ఘకాలిక సమస్యలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిష్కరమయ్యాయని అన్నారు. పట్టణాలు, పల్లెల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని వివరించారు. ఈ నెల 3 వ తేదీ నుండి ప్రారంభం కాకున్న పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజల భాగస్వామ్యంతో అనేక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇందుకోసం 391 ప్రత్యేక టీం లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.