దేశంలో పలువురు ప్రముఖులు క్రమంగా కరోనా బారినపడుతున్నారు. నిన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి వైరస్ నిర్ధారణ కాగా.. తాజాగా, ప్రియాంక గాంధీ కోవిడ్ బారినపడ్డారు. అలాగే, కర్ణాటక ఆరోగ్య మంత్రి డాక్టర్ సుధాకర్కు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ఆయనకు కోవిడ్ సోకడం ఇదే మొదటిసారి. తనకు మోడరేట్ లక్షణాలు ఉన్నాయని డాక్టర్ సుధాకర్ తెలిపారు. హోం ఐసోలేషన్లోనే చికిత్స పొందుతున్నట్టు తెలిపారు.