Friday, May 3, 2024
Friday, May 3, 2024

దేశంలో కొత్తగా 35,342 కరోనా కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. 24 గంటల్లో కొత్తగా 35,342 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణయ్యింది. తాజా కేసులతో దేశంలో ఇప్పటివరకూ కరోనా కేసుల సంఖ్య 3,12,93,062కు చేరాయి. దేశవ్యాప్తంగా 38,740 మంది వైరస్‌ నుంచి కోలుకున్నారు. గడచిన 24 గంటల్లో కరోనా బారినపడి మరణించిన వారి సంఖ్య 483గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. కరోనాతో దేశంలో మరణించిన వారి మొత్తం సంఖ్య 4,19,470కు చేరింది. ఇప్పటివరకు రికవరీ కేసులు 3,12,93,062 కాగా, యాక్టివ్‌ కేసులు 4,05,513గా ఉన్నాయి. దేశంలో ఇప్పటి వరకు 42.34 కోట్లకు పైగా టీకా డోసులు పంపిణీ జరిగింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img