Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

‘నాకు ఆశ్చర్యం కలిగించలేదు’.. రాజ్యసభ ఫలితాలపై శరద్‌ పవార్‌

మహారాష్ట్ర రాజ్యసభ ఎన్నికల ఫలితాలను చూసి తాను షాక్‌కు గురి కాలేదని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) చీఫ్‌ శరద్‌ పవార్‌ అన్నారు.బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ స్వతంత్ర ఎమ్మెల్యేలను తమ వైపు తిప్పుకున్నారని, దీంతోనే ఫలితంలో తేడా వచ్చిందన్నారు. కానీ, అది ప్రభుత్వ స్థిరాత్వాన్ని ప్రభావితం చేయదన్నారు. ఫలితం తనకు ఆశ్చర్యం కలిగించలేదన్నారు. ఓట్లు తక్కువగా ఉన్నప్పటికీ.. ఎంవీఏ కూటమి సాహసోపేతమైన ప్రయత్నం చేసిందన్నారు. చిన్న పార్టీలను, స్వతంత్ర అభ్యర్థులను బీజేపీ వైపు మళ్లించడంలో ఫడ్నవీస్‌ అద్భుతంగా వ్యవహరించారన్నారు. అలాగే.. ఫలితాలపై ఎంపీ సుప్రియా సూలే స్పందించారు. బీజేపీ పనితీరును అభినందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఓటమిని అంగీకరిస్తున్నామని అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img