Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

స్వరాష్ట్రానికి ద్రౌపది ముర్ము

నవీన్‌ పట్నాయక్‌తో చర్చలు`మద్దతిస్తామన్న ముఖ్యమంత్రి

భువనేశ్వర్‌: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము శుక్రవారం స్వరాష్ట్రం ఒడిశాకు చేరుకున్నారు. ఆమె తన అభ్యర్థిత్వం విషయమై ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌తో భేటీఅయ్యారు. తనకు మద్దతివ్వాలని కోరారు. అందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆమెకు మద్దతివ్వాలని ఆయన పిలుపునిచ్చారు. దేశంలో సుడిగాలి పర్యటన చేస్తున్న ముర్ము తన అభ్యర్థిత్వానికి మద్దతిచ్చేవారిని కూడగట్టుకునే పనిలో ఉన్నారు. ఇదే క్రమంలో ఒడిశాకు వచ్చారు. రాజధాని భువనేశ్వర్‌లోని బిజూ పట్నాయక్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఆమె విమానాశ్రయం నుంచి బయటకు వచ్చే సమయంలో అక్కడ సంప్రదాయ నృత్యాలు, డప్పులు`మేళతాళాలతో లయబద్ధమైన ప్రదర్శనలతో కోలాహలంగా ఉంది. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆమెకు స్వాగతం పలికేందుకు రాష్ట్ర అతిథిగృహం వద్ద బారులు తీరారు. ముర్ము రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జార్ఖండ్‌ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టక ముందు ఆమె ఒడిశా మంత్రిగా పనిచేశారు. ముర్ము ఎమ్మెల్యేలు, ఎంపీలను ఉద్దేశించి మాట్లాడుతూ ‘సీఎం చేతికి రాఖీ కట్టాను. ఆయన విదేశాల్లో ఉన్నప్పుడూ నాతో మాట్లాడేవారు. నేను గ్రామీణ మహిళను. మంత్రిగా చాలా కష్టపడ్డాను’ అని చెప్పారు. రాష్ట్రపతిగా ముర్మును ప్రధాని మోదీ ఎంపిక చేయడం సరైనది. ఆమె గిరిజన మహిళ. ఆమె అభ్యర్థిత్వంపై దేశంలోని అందరూ ఉత్కంఠగా ఉన్నారు’ అని భువనేశ్వర్‌ ఎంపీ అపరాజితా సారంగి అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img