ప్రైవేటీకరణను అడ్డుకునేందుకే కోటి సంతకాలు.
విశాలాంధ్ర – కడియం : మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమం వైసిపి రాష్ట్ర కార్యదర్శి నిడదవోలు కొవ్వూరు అబ్జర్వర్ గిరజాల బాబు ఆధ్వర్యంలో కడియం వెంకట నగర్, శ్రీనగర్ లలో నిర్వహించారు. పార్టీ నాయకులు కార్యకర్తలతో ఇంటింటికి వెళ్లి సంతకాలు సేకరిస్తూ ప్రభుత్వ కళాశాలల్లో అర్హత ఉన్న వారికి సీట్లు లేకుండా పేద వారిని వైద్య విద్యకు దూరం చేసేందుకు ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటు వారికి అప్పగిస్తోందని ప్రజలకు వివరించారు. ఈకార్యక్రమంలో పార్టీ నాయకులు దొడ్డాబుజ్జి, పిండి నాగరాజు, కందా రాజు, కడియం గణేష్, కొత్తపల్లి బాలజీ, షేక్ సలీమ్, ముమ్మిడి సత్య ప్రసాద్, పున్నమి రాజు వీర్రాజు, పూడి వీరబ్రహ్మం, బండారు శ్రీనివాస్, కోసూరి సూరిబాబు, చిలుకూరు రామకృష్ణ, తోట సురేష్, తోరాటి గోపి, దామిశేట్టి అశోక్, శాకా సతీష్, తోమ్మిదేళ్ళ సురేష్, బత్తిన శ్రీధర్, ముగడా మధు, వేములూరి బాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.


