ముంబయి: శామ్సంగ్ ఇండియా, స్మార్ట్ వాచ్ అదేవిధంగా టీడబ్ల్యుఎస్ (రు. 5.5కేG విభాగం) బిజినెస్లలో తన నాయకత్వాన్ని సుస్థిరపరచుకొని 2022 మొదటి త్రైమాసికం ఆఖరుకు దేశంలోనే నంబర్ 1 స్మార్ట్ వాచ్ బ్రాండుగా ఉద్భవించింది. ఐడీసీ ప్రపంచవ్యాప్త త్రైమాసిక ట్రాకర్, 2022 మొదటి త్రైమాసికం ప్రకారం, 2022 మార్చి నెలతో అంతమైన మూడు నెలలకు గాను స్మార్ట్ వాచ్ విభాగంలో 65% మార్కెట్ వాటాను, టీడబ్ల్యుఎస్ (రు. 5.5కేG75G డాలర్ల విభాగం) కేటగరీలో 31% మార్కెట్ వాటాను శామ్సంగ్ సాధించింది. ‘‘ఇండియాలో గెలాక్సీ వాచ్4 రెండంకెల వృద్ధిని నమోదు చేసుకుందని, గెలాక్సీ బడ్స్2 తన ప్రీమియం ధ్వని నాణ్యత, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో హృదయాలను గెలుచుకుందని శామ్సంగ్ ఇండియా సీనియర్ డైరెక్టర్, ప్రోడక్ట్ మార్కెటింగ్ హెడ్ ఆదిత్య బబ్బర్ చెప్పారు.