Tuesday, May 7, 2024
Tuesday, May 7, 2024

మూడు రాష్ట్రాల్లో 18 మంది మృతి, దిల్లీ, ముంబైకి అలర్ట్‌

గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు పలు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టిస్తున్నాయి. ఢల్లీి నగరంలో రెండు రోజులు నిరంతర వర్షపాతం నమోదవడంతో దేశ రాజధానికి ఎండల నుంచి ఉపశమనం లభించగా.. దేశంలోని ఇతర ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం వినాశనం సృష్టిస్తోంది. మహారాష్ట్ర,గుజరాత్‌లోని అనేక నగరాలు వరదల్లో చిక్కుకున్నాయి. బుధ, గురువారాల్లో ఢల్లీిలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఉత్తరప్రదేశ్‌లోని రాజధాని పరిసర ప్రాంతాలలో కూడా ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న ఐదు రోజుల్లో వాయువ్య భారతంలో గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో గణనీయమైన మార్పులు ఉండకపోవచ్చని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img