నాయుడుపేట జాతీయ రహదారిపై అదుపు తప్పి ట్రావెల్ బస్సు చెట్టును ఢీకొని ముగ్గురికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ బస్సు విజయవాడ నుంచి బెంగళూరు వెళుతుండగా ప్రమాదానికి గురయ్యింది. ఇంకా పూర్తి వివరాలు అందవలసి వుంది.