Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

రాజకీయాలకతీతంగా నెల్లూరు రూరల్ అభివృద్ధి

వైసీపీ రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

రాజకీయాలకతీతంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నామని వైసిపి రాష్ట్ర కార్యదర్శి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు. నెల్లూరు రూరల్ పరిధిలోని మాగుంట లేఔట్- అండర్ బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రారంభోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా పేదవారి సంక్షేమ ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నారని వివరించారు. రూరల్ పరిధిలో రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ పోట్లూరు స్రవంతి, స్థానిక కార్పొరేటర్ దాసరి అమృత తదితరులు పాల్గొన్నారు*

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img