Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

జగనన్న గోరుముద్ద నాణ్యతలో రాజీ లేదు

కొయ్యలగూడెం : జగనన్న గోరుముద్ద భోజన నాణ్యత విషయంలో రాజీ పడవద్దని ఎంపీపి గంజిమల రామారావు అన్నారు. మండలంలో గంగన్నగూడెం గ్రామంలో ఎంపీపి పాఠశాలను ఆయనసందర్శించారు.ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్యం కోసం వారి భవిష్యత్తు కోసంకోట్లాది రూపాయలను ఖర్చు పెట్టి చిన్నారులకు మధ్యాహ్నం భోజనాలను అందిస్తున్న విషయంలో నాణ్యత పాటించాలని తెలిపారు. తిమ్మన కుంట గ్రామంలో ఇటీవల ప్రమాదానికి గురైన పార్టీ కార్యకర్తను పరామర్శించారు. అనంతరం గుండెపోటుతో మరణించిన టిడిపి మండల అధ్యక్షుడు
వాడపల్లి నాగార్జున భౌతిక ఖాయానికి నివాళులర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎంపీపీ వెంట మండల కో ఆప్షన్ సభ్యులు ఎస్.కె బాజీ, నారా రామకృష్ణ, చవల వెంకట నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img