ఉత్తరప్రదేశ్లో పెను విషాదం చోటుచేసుకుంది. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా గోడలు కూలి ఏడుగురు మృతి చెందారు. మూడు వేర్వేరు ఘటనల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇటావాలోని సివిల్ లైన్స్ ప్రాంతంలోని చంద్రపురా గ్రామంలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా గోడ కూలి చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరికొంతమంది గాయపడ్డారు. క్షతగాత్రులను భీమ్రావ్ అంబేద్కర్ జాయింట్ ఆస్పత్రికి తరలించారు. ఇంటి గోడ కూలి నలుగురు పిల్లలు నిద్రలోనే మరణించారు.