విజయవాడ : 6వ డివిజన్లో ఇండియన్ స్వచ్ఛభారత్ లీగ్ కార్యక్రమం జరిగింది. దీనిలో భాగంగా 34వ సచివాలయం సిబ్బంది ప్రజలతో మమేకమవుతూ పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కల్పిస్తూ మన ఆరోగ్యం మన చేతుల్లోనే వుంటుందని, పొడి చెత్త, తడి చెత్తను వేరు వేరుగా వుంచడం వల్ల వుండే ఉపయోగాలను వివరిస్తూ అలా చేయడంవల్ల మనం ఆరోగ్యంగా వుంటూ, దోమలకు, క్రిమి కీటకాలకు దూరంగా వుండవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ వి. అమర్నాథ్, శానిటరి ఇన్స్పెక్టర్ వై.ఎన్.కమలాకర్, 34వ సచివాలయం అడ్మిన్ చినబాబు, ఎడ్యుకేషన్ సెక్రటరి రాజేష్, శానిటేషన్ సెక్రటరీ శివరామకృష్ణ, ప్లానింగ్ సెక్రటరి గోపి, హెల్త్ సెక్రటరీ నాగరాణి, వెల్ఫేర్ సెక్రటరీ సుజల, వాలంటీర్ ఉమా మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.