Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

దిల్లీలో బాణసంచా పేలుడు నిషేధంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు

దేశ రాజధాని దిల్లీలో బాణసంచా కొనుగోలు చేసినా, కాల్చినా జరిమానాతో పాటు జైలు శిక్ష తప్పదంటూ బుధవారం దిల్లీ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అరవింద్‌ కేజ్రీవాల్‌ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ గురువారం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఈ పిటిషన్‌ ను అత్యవసరమైనదిగా భావించి తక్షణమే విచారణ చేపట్టాలని పిటిషనర్లు కోర్టును కోరారు. అయితే, అందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అంతేకాకుండా ఈ పిటిషన్‌ పైనా, దిల్లీలో బాణసంచా నిషేధంపైనా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్‌ పై ఇప్పటికిప్పుడు విచారణ చేపట్టాల్సిన అవసరం లేదని కోర్టు అభిప్రాయపడిరది. ఇప్పటికైనా ప్రజలను కాస్తంత స్వచ్ఛమైన గాలిని పీల్చుకోనీయండి అంటూ పిటిషనర్లను ఉద్దేశించి కోర్టు వ్యాఖ్యానించింది. బాణసంచా మీద పెట్టే ఖర్చుతో మిఠాయిలు కొనుక్కోవాలని సూచించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img