అనంతపూర్ జిల్లా, విశాలాంధ్ర-తాడిపత్రి: స్థానిక బస్టాండ్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద ప్రధాని మోడీ గో బ్యాక్ అంటూ, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం ఆపాలని శుక్రవారం సిపిఐ నియోజవర్గ కార్యదర్శి టి రంగయ్య, మండల కార్యదర్శి నాగ రంగయ్య ఆధ్వర్యంలో రాస్తారోకా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని మోడీ ప్రధానమంత్రి మోడీ గతంలో అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని పిడికిలి మట్టి చెంబు నీరు తెచ్చి ఇచ్చారు. ఇప్పటికీ అమరావతికి అభివృద్ధికి ఇలాంటి సహాయ సహకారాలు అందించలేదన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయడం వల్ల ఎంతో మంది కార్మికులు నష్టపోతారన్నారు. అంతేకాకుండా డీజిల్, పెట్రోల్, వంటగ్యాస్, వంట నూనెలు, నిత్యవసర సరుకు ధరలు పెంచి పేద ప్రజలపై భారం మోపుతున్నారు. విభజన హామీలు నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. కావున విశాఖ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మోడీని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి నాయకుడు వెంకటరమణ రైతు సంఘం నాయకుడు నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి రాస్తారోక చేస్తున్న సిపిఐ నాయకులు ఫోటో దృశ్యం