లబోదిబొ మంటున్న కుటుంబ సభ్యులు
విశాలాంధ్ర, కొమరాడ/బెలగాం: మన్యం జిల్లాలో కొమరాడ మండలంలోని కల్లికోట గ్రామానికి చెందిన రైతును పొలంలో శుక్రవారంఅర్ధరాత్రి అకస్మాత్తుగా ఒక్కసారి ఏనుగు దాడిచేసి చంపిన సంఘటన చోటచేసుకుంది. వివరాల్లోకి వెళితే కళ్లికోట గ్రామానికిచెందిన దాసరి గోవింద్ (48)శుక్రవారం రాత్రిపొలంలో వరిపంటకు నీరు కట్టడానికి వెళ్ళాడు. రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో అతను నీరు కడుతుండగా ఒక్కసారి హరి అనే పెద్ద ఏనుగు దాడిచేసి అతన్ని అక్కడికక్కడే చంపిది. మృతునికి భార్య, ఇద్దరుపిల్లలు ఉన్నారు. మృతి విషయాన్ని తెలుసుకున్న వెంటనే సంఘటన స్థలానికి అటవీ,పోలీసు అధికారులతో పాటు కల్లికొట గ్రామస్తులు చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. జిల్లాఆసుపత్రి వద్దకు మృతుని కుటుంబసభ్యులు,
బందువులు,కొమరాడమండల వామపక్ష పార్టీల నాయకులు, టిడిపినాయకులు చేరుకొని ధర్నా నిర్వహించారు. మృతుని కుటుంబానికి 50లక్షల నష్టపరిహారం చెల్లించాలని, కుమారుడుకి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని అంతవరకు కదిలేది లేదని స్పష్టం చేశారు. స్థానిక పోలీస్ సిఐ విజయానంద్, ఎస్ఐలు చేరుకుని నచ్చ జెప్పిన పలితంలేకపోవడంతో జిల్లాఅటవీ అధికారి ప్రసూన, అటవీరేంజర్ త్రినాథ రావు, కురుపాం రేంజర్ రాజబాబులనురప్పించారు.చర్చలు జరిపి ఐదులక్షల ఎక్స్ గ్రేషియాతో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని తెలిపారు. దీంతో ఆందోళన విరమించారు. సవపంచనామా నిర్వహించి,పోస్ట్ మార్టం పూర్తయ్యాక మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. కళ్ళికోటలో సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. ఆసుపత్రి వద్దనే కాకుండా కళ్ళికోటవెళ్ళి మృతి చెందిన దాసరి గోవింద్ కుటుంబ సభ్యులను టిడిపి నియోజక వర్గం ఇంచార్జి జగదీశ్వరి, సీపీఐసహాయ కార్యదర్శి జీవన్, సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులుకొల్లి సాంబమూర్తి, కొమరాడ మండలం తెలుగుదేశం పార్టీకన్వీనర్ ఎస్ శేఖర్ పాత్రుడు అరకు పార్లమెంటు తెలుగు రైతు అధ్యక్షులు దేవకోటి వెంకటినాయుడు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నంగిరెడ్డి మధుసూదన్రావు ,రాష్ట్ర తెలుగుదేశం ఉపాధ్యక్షులు మరడాన కృష్ణమూర్తినాయుడు,కృష్ణబాబు తదితరులు గోవింద్ కుటుంబసభ్యులను పరామర్శించారు. ఆసుపత్రి వద్దకు పరామర్శకు వస్తున్న మాజీమంత్రి శత్రుచర్ల విజయరామరాజును గరుగుబిల్లి పోలిసులు అడ్డుకున్నారు.గతఏడాది కూడా ఇదే గ్రామానికి చెందిన కోట అప్పమ్మ అనే మహిళను కూడా ఐదే ఏనుగు పొట్టన పెట్టుకుంది. పోలిసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.