Friday, April 26, 2024
Friday, April 26, 2024

మన్యంజిల్లా ప్రధాన కార్యదర్శిని పోలీస్ స్టేషన్లో ఉంచిన దోనుబాయి పోలీసులు

విశాలాంధ్ర,పార్వతీపురం/సీతమ్మపేట/పాలకొండ: ప్రధాన మంత్రి మోదీ విశాఖ పర్యటనదృష్ట్యా పార్వతీపురం మన్యంజిల్లా సీపీఐ ప్రధాన కార్యదర్శి కోరంగి మన్మధరావును, ఏఐవైఎఫ్ జిల్లాఅధ్యక్షుడు కె.గోపినాయుడులను ముందస్తుగా అరెస్టు చేసి పాలకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో దోనుబాయి పోలీస్ స్టేషన్లో ఉంచారు. అలాగే సీపీఐ మన్యంజిల్లా కార్యవర్గ సభ్యులు బుడితి అప్పలనాయుడును పాలకొండలోని ఆయనఇంటివద్దనే పాలకొండ పోలీసులు గృహ దిగ్బంధం చేశారు. ఆంధ్రులంతా పోరాటాలు, ప్రాణ త్యాగాలుచేసి సాధించిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటుకరణ చేసిన మోదీ ప్రభుత్వంపై గద్దెదిగేవరకు సీపీఐ నిరసనలు చేస్తుందని మన్మధరావు, అప్పలనాయుడులు తెలిపారు. తక్షణమే విశాల స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇదిలాఉండగా రెండు రాష్ట్రాల్లో ముందస్తు అరెస్టులు చేసి దిగ్బంధం చేయడాన్నిసీపీఐపార్టీ ఖండిస్తుందని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img