Friday, May 3, 2024
Friday, May 3, 2024

బడి బయట ఉన్న విద్యార్థులను బడిలో చేర్చండి ఎంఈఓ శ్రీధర్‌ పిలుపు

విశాలాంధ్ర ` శెట్టూరు : యాటకల్లు గ్రామంలో గురువారం విద్యాశాఖ అధికారుల ఆధ్వర్యంలో బడి బయట ఉన్నటువంటి విద్యార్థుల వివరాలు సేకరించి వారిని బడిలో చేర్చే విధంగా చూడాలని ఎంఈఓ శ్రీధర్‌ తెలియజేశారు. గ్రామ సచివాలయ సిబ్బంది వాలంటీర్ల ద్వారా సర్వే నిర్వహించి వారి తల్లిదండ్రులకు రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం ప్రవేశపెట్టిన అమ్మ ఒడి పథకం, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్య కానుక తదితరుల వాటిపైన ప్రజలకు అవగాహన కల్పించి ఏ విద్యార్థి కూడా నష్టపోకుండా ప్రతి విద్యార్థి కూడా బడిలో చేరే విధంగా చూడాలని గ్రామ ప్రజలకు గ్రామ వాలంటరీ కూడా బడి బయట ఉన్న విద్యార్థుల పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన సూచించారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img