విశాలాంధ్ర, పార్వతీపురం: నియోజకవర్గం లోని పార్వతీపురంమండలం రావికోన, బట్టివలస, కొత్తవలసగ్రామాల్లో గిరిజన యువతకు వాలీబాల్ కిట్లును నియోజకవర్గం తెలుగుదేశం సీనియర్ నాయకులు గర్భాపు. ఉదయభాను గురువారం అందజేసారు. ఆయా గ్రామాల్లో పేదలఇంటికివెల్లి వారినికలసి వారి కష్టాన్ని తెలుసుకున్నారు. టిడిపిని రానున్న ఎన్నికల్లో గెలిపించి చంద్రబాబునాయుడును మరలా ముఖ్య మంత్రిగా చేస్తే పేదలను ఆన్ని విధాలుగా ఆదుకుంటారని తెలిపారు. ఈకార్యక్రమంలో ఆయాగ్రామాల గిరిజనులు, గిరిజనయువత పాల్గొన్నారు.