ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
విశాలాంధ్ర-రాప్తాడు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి, సంక్షేమం రెండూ ప్రధాన లక్ష్యమని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. మండలంలోని జి కొత్తపల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఎన్నో ప్రభుత్వాలు చూశారు..ఏ ప్రభుత్వంలోనైనా మూడేళ్లలో ఒక్కో కుటుంబానికి ఇలాంటి సంక్షేమ పథకాలను ఏ ముఖ్యమంత్రి అయినా ప్రవేశపెట్టారా ఆని, సీఎం జగన్మోహన్ రెడ్డి అందరివాడు కాబట్టి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికీ తిరిగిన ఎమ్మెల్యే ప్రభుత్వం వల్ల కల్గిన లబ్ధి ఏ మేరకు జరిగిందో వివరించి…ఆయా కుటుంబాలకు జరిగిన లబ్ధి పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు. అలాగే స్థానిక సమస్యలను తెలుసుకుంటూ వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సాల్మన్, కన్వీనర్ జూటూరు శేఖర్, యూత్ కన్వీనర్ చిట్రెడ్డి సత్తిరెడ్డి, సర్పంచ్ పి.చంద్రకళచిన్నకృష్ణారెడ్డి, హౌసింగ్ ఏఈ రామమూర్తి, ఏపీఓ రామకృష్ణారెడ్డి, ఎంపీటీసీ రాముడు, నాయకులు బాలకృష్ణారెడ్డి, మరూరు ఆది, జి.ప్రసాదరెడ్డి, నరసింహులు, రఘునాథరెడ్డి,
తిరుపాల్ రెడ్డి, ఖాసీం, నిరంజనరెడ్డి, మాజీ ఎంపీటీసీ లక్ష్మివేంకటేశ్వరమ్మ, తాతిరెడ్డి, జనార్దనరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.