ప్రముఖ నటుడు కమల్హాసన్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అనారోగ్యం కారణంగా ఆయన బుధవారం రాత్రి చెన్నైలోని శ్రీరామచంద్ర హాస్పిటల్ కు వెళ్లారు. అన్ని పరీక్షలు చేసిన అనంతరం రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని కమల్ కు వైద్యులు సూచించారు. అనంతరం ఆయన్ని డిశ్చార్జ్ చేశారు.కమల్ అనారోగ్యం వార్త అభిమానులను కలవరానికి గురి చేసింది. బుధవారం హైదరాబాద్కు వచ్చిన సందర్భంగా కమలహాసన్, తన గురు సమానులైన దిగ్గజ దర్శకుడు కే విశ్వనాథ్ ను కలుసుకోవడం తెలిసిందే. అదే రోజు రాత్రి చెన్నైకి తిరిగి వెళ్లిన వెంటనే ఆయన అస్వస్థతకు గురయ్యారు.