Thursday, May 2, 2024
Thursday, May 2, 2024

మహిళలపై రామ్‌దేవ్‌ బాబా వ్యాఖ్యలు.. దిల్లీ మహిళా కమిషన్‌ ఆగ్రహం…

యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తనలాగా ఏమీ ధరించకపోయినా మహిళలు బాగుంటారని అనడంతో ఆయనపై దిల్లీ మహిళా కమిషన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన దేశంలోని మహిళలందరికీ క్షమాపణ చెప్పాలని కోరింది. ఆయన ఈ వ్యాఖ్యలు చేసినపుడు వేదికపై ఉన్నవారిలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ సతీమణి అమృత ఫడ్నవీస్‌ కూడా ఉన్నారు. రామ్‌దేవ్‌ వ్యాఖ్యలపై ఢల్లీి మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌ ట్విటర్‌ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సతీమణి సమక్షంలో స్వామి రామ్‌దేవ్‌ మహిళలపై చేసిన వ్యాఖ్యలు అమర్యాదకరంగా ఉన్నాయని, ఖండిరచదగినవని ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలు మహిళలందరినీ బాధించాయన్నారు. ఈ వ్యాఖ్యలు చేసినందుకు బాబా రామ్‌దేవ్‌ దేశానికి క్షమాపణ చెప్పాలన్నారు.శివసేన (ఉద్ధవ్‌ బాలా సాహెబ్‌ థాకరే) నేత సంజయ్‌ రౌత్‌ స్పందిస్తూ, బాబా రామ్‌దేవ్‌ వ్యాఖ్యలపై అమృత ఫడ్నవీస్‌ ఎందుకు నిరసన తెలియజేయలేదని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img